
భద్రాద్రి సీతారాముల్ని దర్శించుకొనేందుకు ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివతో కలిసి భద్రాచలం రానున్నారు. ఇరువురు కూడా సతీసమేతంగా ఉదయం 9 గంటల సమయంలో రాములోరిని దర్శనం చేసుకునే వీలుంది.
పర్యటన వివరాలను వల్లూరిపల్లి వంశీకృష్ణ నేతృత్వంలో అధికారులకు లేఖ ద్వారా సమాచారం అందించారు.
రామయ్యకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతో భద్రాచలంలో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం 4 గంటలకు వాహనాలలో హైదరాబాద్ నుంచి బయల్దేరి 9 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. ఆ తర్వాత దాదాపు అరగంట పాటు పూజల్లో పాల్గొంటారు. 9:45 గంటలకు అభిమాన సంఘం నాయకుడు తాళ్లూరి రమేష్ నివాసానికి చేరుకుని అక్కడ ఆల్పాహారం చేసి హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. 11.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారని పేర్కొన్నారు.